Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహగిరి గిరిప్రదక్షిణ వైభవం

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 6:46 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
సింహగిరి గిరిప్రదక్షిణ వైభవం - Udayam Digital
ఆషాఢ చతుర్దశి సందర్భంగా సింహాచలం గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది. చిరుజల్లుల మధ్య లక్షలాది మంది భక్తులు ‘నమో నారసింహాయ’ నామస్మరణతో 32 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ నిర్వహించారు. దాదాపు ఆరు లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు ఆలయ వర్గాలు అంచనా వేశాయి. భక్తులకు సేవా సంస్థలు తాగునీరు, మజ్జిగ, అల్పాహారం అందించగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...