వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు అవకాశం కల్పించారు. సీతంపేటలోని GTWAHS బాయ్స్ పాఠశాలను స్టడీ సెంటర్గా ఏర్పాటు చేశారు.
ఓపెన్ 10వ తరగతిలో 100 సీట్లు, ఇంటర్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 2026 సెప్టెంబర్ 15వ తేదీలోగా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Comments
Loading comments...

