వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని లోతరే, అనుబంధ గ్రామాలలో గిరిజనులు విష జ్వరాలతో బాధపడుతున్నారని ఆ గ్రామ సర్పంచ్ బోడ శంకర్, ఉప సర్పంచ్ నానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ లోతరే గ్రామానికి చెందిన హెచ్.కే.సోము మలేరియా పాజిటివ్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారన్నారు.
గ్రామంలో సరైన వైద్య సౌకర్యాలు లేవని వాపోయారు. ఇప్పటికైనా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వైద్యులను కోరారు.
Comments
Loading comments...

