వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండలం ఇందుగపల్లి శివారులో దారిని తెలిపే సూచిక బోర్డు ఇంటి పహారీ గోడలో ఉండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.
ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బోర్డు స్పష్టంగా కనిపించేలా కొత్త సూచిక ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

