వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన బిక్కనూర్ సిద్ధిరామేశ్వర ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు.
ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ లింబాద్రి, పట్టణ సర్పంచ్ రేఖ, నాయకులు సుదర్శన్, విజయ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

