Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన అన్నాచెల్లెళ్లు సురక్షితం!

లక్ష్మి దేవి Jul 24, 2026 6:54 AM కృష్ణా జిల్లాabout 2 hours ago
తల్లి వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన అన్నాచెల్లెళ్లు సురక్షితం! - Udayam Digital
తల్లి కొడుతుందనే మనస్తాపంతో ఇల్లు విడిచి వెళ్లిన అన్నాచెల్లెళ్లను కొత్తపేట పోలీసులు గుర్తించారు. సీతానగరం వద్ద మత్స్యకారుల ఆశ్రయం కోరిన పిల్లలను, తల్లికి క్షేమంగా అప్పగించినట్లు సీఐ చిన కొండలరావు తెలిపారు. పని ఒత్తిడితో తల్లి తరచూ మందలించడంతోనే పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది. అదృశ్యమైన కేసును ఛేదించి పిల్లలను సురక్షితంగా చేర్చిన పోలీసులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...