వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్ లో సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో బహుభాషా నాటిక పోటీలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ నెల 20వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు రుద్రమూర్తి తెలిపారు. కళాప్రేమికులను అలరించేలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల బృందాలు అద్భుతమైన నాటికలను ప్రదర్శించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు నాటక కళాభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.
Comments
Loading comments...

