వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 12 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ డా.కె.నారాయణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సీట్ల భర్తీకి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.సివిల్ ఇంజినీరింగ్లో 10,కంప్యూటర్ సైన్స్లో 1,మెకానికల్ ఇంజినీరింగ్లో 1 సీటు ఖాళీగా ఉందన్నారు.అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలకు హాజరై స్పాట్ అడ్మిషన్ పొందాలని సూచించారు.
Comments
Loading comments...

