Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరత్‌లో షాకింగ్ ఘటన

వినయ్ కుమార్ Jul 22, 2026 2:41 PM అల్ ఇండియా in about 3 hours
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ చైనీస్ ఫుడ్ సెంటర్‌లో మంచూరియా తింటుండగా ప్లేట్‌లో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. బాధితుడు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, పరిశుభ్రత లోపించడమే కాకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో షాపు యజమానికి రూ.10,000 జరిమానా విధించారు.

Comments

G
Loading comments...