Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుత నవరాత్రి వేడుకలకు సహకరించాలి: ఎస్సై

Follow Udayam on Google
madhu Sep 14, 2026 6:51 PM ములుగుGeneral
శాంతియుత నవరాత్రి వేడుకలకు సహకరించాలి: ఎస్సై - Udayam
గణపతి నవరాత్రి వేడుకలు శాంతియుత వాతావరణంలో కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పస్రా ఎస్ఐ తాజుద్దీన్ కోరారు. ఆదివారం మండలంలోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మతసామరస్యాన్ని పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. కుల, మత విద్వేషాలను ప్రేరేపించే కార్యక్రమాలు, ప్రసంగాలు చేయకూడదన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...