వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం బాలిగాం గ్రామంలో సీఐ తిరుపతి రావు, ఎస్ఐ కృష్ణ ప్రసాద్ ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి గ్రామస్తులతో సమావేశమయ్యారు. రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని పరిస్థితులు, శాంతిభద్రతలపై గ్రామస్తులతో చర్చించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలు పాటించాలన్నారు.
Comments
Loading comments...

