వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం గరపాడులో గంజాయి విక్రయానికి సిద్ధమైన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కేజీల గంజాయి, 2 బైకులు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరకు ఏజెన్సీ నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

