వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా పాలకొండ లో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొండ ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 10 యూనిట్ల రక్తాన్ని దానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

