వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలంలో పలు సచివాలయాలు పెన్షన్ దారులతో బుధవారం రద్దీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించడంతో పలువురు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ హిస్టరీ కోసం మీ సేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పింఛన్ కోసం దరఖాస్తులు చేయడం కోసం సచివాలయాల వద్ద బారులు తీరారు. దరఖాస్తులు నింపడానికి వెలుగు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Comments
Loading comments...

