Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయాల వద్ద పెన్షన్‌ దరఖాస్తుల రద్దీ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:29 PM పార్వతీపురం మన్యంGeneral
సచివాలయాల వద్ద పెన్షన్‌ దరఖాస్తుల రద్దీ - Udayam
సాలూరు మండలంలోని పలు సచివాలయాలు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో బుధవారం రద్దీగా కనిపించాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ హిస్టరీ కోసం పలువురు మీ సేవ, రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. పెన్షన్‌ దరఖాస్తుల కోసం సచివాలయాల వద్ద ప్రజలు బారులు తీరారు. దరఖాస్తులు నింపేందుకు వెలుగు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Comments

G
Loading comments...