వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి సహా పలు జిల్లాల్లో స్క్రబ్బర్ బిజినెస్ పేరుతో భారీ మోసం జరిగినట్లు తెలుస్తోంది. మిషన్కు రూ.30 వేలు, డిపాజిట్గా రూ.లక్ష తీసుకుని, నెలకు 6 వేల స్క్రబ్బర్లు తయారు చేస్తే రూ.24 వేలు ఇస్తామని నమ్మించారు.
తొలుత 3 నెలలు చెల్లింపులు చేసి ఆపై నిలిపివేశారు. రాజమండ్రి, కాకినాడ, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 4 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. నష్టం రూ.కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.
Comments
Loading comments...

