Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల పంపిణీలో సబ్బవరం ప్రథమం

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 9:01 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
పింఛన్ల పంపిణీలో సబ్బవరం ప్రథమం - Udayam Digital
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ గురువారం నాటికి 90.03 శాతానికి చేరినట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. మొత్తం 2,51,357 మందికి గాను 2,26,295 మందికి పింఛన్లు అందించారు. కలెక్టర్ విజయకృష్ణన్ అసకపల్లిలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించగా, 94.43 శాతంతో సబ్బవరం మండలం తొలి స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...