వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూర మండలంలోని మందర్న హున్స, ఖాజాపూర్, తగెల్లి, సాలూర మీదుగా బోధన్కు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సీట్లు సరిపోక విద్యార్థులు ఫుట్బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్నారు.
రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని విద్యార్థులు తెలిపారు. ప్రమాదాలు జరగకముందే ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని కోరారు.
Comments
Loading comments...

