Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 10, 2026 7:02 AM జగిత్యాలతెలంగాణ
రూ.500 వివాదం.. వ్యక్తి ఆత్మహత్య - Udayam Digital
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బకాయి విషయంలో తలెత్తిన వివాదం అనంతరం బందెల రమేశ్‌(38) ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు అడిగినందుకు గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఎదుట జరిగిన ఘటనతో మనస్తాపానికి గురైన రమేశ్‌ ఇంట్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...