వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బకాయి విషయంలో తలెత్తిన వివాదం అనంతరం బందెల రమేశ్(38) ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు అడిగినందుకు గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు.
కుటుంబ సభ్యుల ఎదుట జరిగిన ఘటనతో మనస్తాపానికి గురైన రమేశ్ ఇంట్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
