Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 25000 విలువచేసే వంట సామాగ్రి అందజేత

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 10:04 PM మంచిర్యాలGeneral
రూ. 25000 విలువచేసే వంట సామాగ్రి అందజేత - Udayam
దండేపల్లి మండలంలోని మేదరి పేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘానికి రూ. 25 వేలు విలువచేసే వంట సామాగ్రిని మాదంశెట్టి మల్లికార్జున్ సుమాంజలి దంపతులు అందజేశారు. శనివారం సాయంత్రం అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు వారు వంట పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ దంపతులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 100 కుటుంబాలకు మేలు చేసే విధంగా అంబేద్కర్ సంఘానికి వంట సామాగ్రిని అందజేయడం జరిగిందని అన్నారు.

Comments

G
Loading comments...