వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ రోడ్డు వద్ద బొలెరో ఢీకొని చాకలి భీమయ్య(80) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రపహాడ్ ఆసుపత్రి నుంచి టీవీఎస్ వాహనంపై తిరిగి వస్తుండగా వెనుక నుంచి బొలెరో వేగంగా ఢీకొట్టింది.
తలకు తీవ్ర గాయాలై, రక్తస్రావంతో ఆయన అక్కడే మరణించాడు. మృతుడి కుమారుడు రమాకాంత్ ఫిర్యాదుతో ఘటనపై తాడ్వాయి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

