Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలలుగా ఆగిన రహదారి పనులు

Follow Udayam Digital on Google
ఆరు నెలలుగా ఆగిన రహదారి పనులు - Udayam Digital
అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ ఆర్‌.టి.పురం గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. గుత్తేదారు పిక్క వేసి పనులు నిలిపివేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పిక్క కొట్టుకుపోయి రహదారి మరింత అధ్వానంగా మారింది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పనులు పునఃప్రారంభం కాలేదని స్థానికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...