వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి నిల్వ మొత్తం సామర్థ్యంలో 32.67 శాతం (346 టీఎంసీలు) మాత్రమే ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నిల్వ సామర్థ్యం 1,053 టీఎంసీలు కాగా, కృష్ణా, గోదావరి బేసిన్లలోని కొన్ని ప్రధాన జలాశయాలకే ఇన్ఫ్లో వస్తోందని పేర్కొన్నారు.
నీటి నిల్వ 50 శాతం దాటాలంటే పరీవాహక ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో మరో వారం పాటు భారీ వర్షాలు కురవాల్సి ఉందని వెల్లడించారు.
Comments
Loading comments...
