వార్తలకు తిరిగి వెళ్లండి
ఇసుక క్వారీని మార్చాలని కలెక్టర్కు వినతి
Harika Jun 22, 2026 1:06 PM కరీంనగర్ 7 viewsabout 1 hour ago

వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి పేరిట ఉన్న ఇసుక క్వారీని తమ గ్రామానికి మార్చాలని కొండపాక ప్రజాప్రతినిధులు కలెక్టర్ చిత్రమిశ్రాకు వినతిపత్రం అందజేశారు. క్వారీ కారణంగా స్థానికులు ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొండపాక రెవెన్యూ పరిధిలోని మానేరువాగుపై ఉన్న క్వారీని తమ గ్రామం పేరిట మార్చి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూరెళ్ల కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...