వార్తలకు తిరిగి వెళ్లండి

తలకొండపల్లి మండలం రాంపూర్లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించే బోనాలను పురస్కరించుకుని గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు గ్రామ పంచాయతీ అధికారులు చేపట్టారు. గుంతలతో భక్తులు ఇబ్బంది పడకుండా గురువారం మట్టితో రోడ్లను చదును చేశారు.
కోట మైసమ్మ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల్లో బోనాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిర్మల శ్రీశైలం, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

