వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి ఇటీవల హత్యకు గురైన సంఘటనపై గురజాల డీఎస్పీ మహేశ్వరరావు వివరాలు వెల్లడించారు.
శుక్రవారం గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ హత్య వెనుక ఆధిపత్య పోరే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.విచారణలో భాగంగా దాచేపల్లి-మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

