Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్తంభించిన 86 కేంద్ర పథకాలను తిరిగి గాడిలో పెట్టాం

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 04, 2026 11:55 PM అమరావతిఆంధ్రప్రదేశ్
స్తంభించిన 86 కేంద్ర పథకాలను తిరిగి గాడిలో పెట్టాం - Udayam Digital
గత ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపుతో నిలిచిపోయిన 86 కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి కార్యరూపంలోకి తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత రెండేళ్లలో కేంద్ర పథకాల అమలుపై రూ.45 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. పనులు పూర్తిచేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయి కాబట్టి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు సాగామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...