Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోగా ఫసల్ బీమాలో నమోదు చేసుకోండి: ఏవో

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 05, 2026 12:39 PM నంద్యాలGeneral
ఆగస్టు 15లోగా ఫసల్ బీమాలో నమోదు చేసుకోండి: ఏవో - Udayam
ఖరీఫ్ పంటలకు రక్షణగా రైతులంతా ఆగస్టు 15లోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో నమోదు చేసుకోవాలని నంద్యాల ఏవో ప్రసాదరావు సూచించారు. మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు. చాపిరేవుల, పాండురంగాపురం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పంటలపై సూచనలు చేశారు. ఈ ఖరీఫ్‌కు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను వివరించి, వాటిని పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...