వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడి, స్వాధీనం చేసుకున్న ఇసుకను వేలం వేస్తామని బషీరాబాద్ తహసీల్దార్ షాహిదాబేగం తెలిపారు. ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు.
15 ట్రిప్పులు ఉందని, ఇసుక విలువ రూ. 27,000 ఉంటుందన్నారు. 20 శాతం డిపాజిట్ చేసి కార్యాలయంలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

