వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలోని రెడ్డి జన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కోప్పర వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు.
యువత దేశభక్తి, విలువలను పెంపొందించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

