Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్ దక్కకపోతే రెబల్స్ బరిలోకి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:05 AM గుంటూరుGeneral
టికెట్ దక్కకపోతే రెబల్స్ బరిలోకి - Udayam
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు సిద్ధమవుతున్నారు. వైసీపీతో పోలిస్తే కూటమిలో ఆశావహుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. జనసేనకు 40 శాతం, బీజేపీకి 20 శాతం సీట్లు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆశించిన స్థాయిలో కార్పొరేటర్ టికెట్లు రాని వారు రెబల్స్‌గా బరిలో దిగనున్నట్లు సమాచారం. టికెట్ల కేటాయింపుపై ఆయా పార్టీల పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Comments

G
Loading comments...