వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెన మండల కేంద్రంలోని 14వ వార్డులో నాలీల పూడిక తీసి వారం పది రోజులు అవుతున్నా బురదను అక్కడే వదిలేశారు. దీంతో రోడ్డుపై బురద పేరుకుపోయి దుర్వాసన వస్తోందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బురద కారణంగా రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. పంచాయతీ సిబ్బంది స్పందించి ట్రాక్టర్తో బురదను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

