వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండలం జగపతినగరం పరిధిలోని ప్రభుత్వ కొండల భూములను కొందరు రియల్టర్లు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డీ పట్టాదారులను ప్రలోభపెట్టి భూములను తమ స్వాధీనంలోకి తెచ్చుకుని, భారీ యంత్రాలతో కొండలను చదును చేస్తున్నారు.
అనంతరం వాటిని లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. రాజకీయ అండతో ఈ వ్యవహారం సాగుతున్నా రెవెన్యూ, గనుల శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
Comments
Loading comments...

