Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన వ్యాధితో యువకుడు.. సాయం కోసం విజ్ఞప్తి

Follow Udayam Digital on Google
అరుదైన వ్యాధితో యువకుడు.. సాయం కోసం విజ్ఞప్తి - Udayam Digital
శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన బిడద సుధీర్‌మహేశ్ అరుదైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. చికిత్సకు నెలకు రూ.20 వేల ఖర్చవుతోందని, ప్రస్తుతం రూ.6 వేల పింఛను సరిపోవడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. సదరం రీఅసెస్‌మెంట్ చేసి హెల్త్ పింఛను రూ.15 వేలకు పెంచాలని వారు కోరారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి పరిస్థితి వివరించగా, ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...