వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 18 ఫిర్యాదులు అందాయి. వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.
జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ బాధితుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

