Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలి - ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 8:59 PM విజయనగరంGeneral
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలి - ఎమ్మెల్యే - Udayam
చీపురుపల్లి నియోజకవర్గంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని స్దానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు అధికారులను మంగళవారం ఆదేశించారు. రాజాంలోని తన నివాసంలో ఈపీడీసీఎల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నందున వ్యవసాయ పంపుసెట్లకు సకాలంలో, నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...