Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 2:54 PM అనంతపురంGeneral
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
రాప్తాడు మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పాడిరైతులకు సబ్సిడీ ధానా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ..50 శాతం సబ్సిడీతో వీటిని రైతులకు అందజేశామన్నారు. ఒక్కో బ్యాగు ధర రూ.1,100 ఉండగా, సగం సబ్సిడీతో రూ.550కే రైతులకు ఇచ్చారు. ఒక్కో రైతుకు 50 కేజీల ధానా బ్యాగులను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్మన్నారు.

Comments

G
Loading comments...