వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కేజీ ఉల్లి రూ.32కే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దిల్లీ పర్యటన అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
కేంద్రం సహకారంతో రాయితీ ధరలపై కందిపప్పు, పామాయిల్ కూడా అందించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి మీమార్టుల ద్వారా తక్కువ ధరలకే నిత్యావసర సరకులు అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Loading comments...

