వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలోని కళింగదళ్ ప్రాజెక్టు వద్ద పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం జలహారతి నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి లభ్యత, సరఫరా పరిస్థితులను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నీటిని సద్వినియోగం చేసుకుని పంటలు సాగు చేసుకోవాలని రైతులను కోరారు. రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

