Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానలు కరువైనా.. సాగుకు భరోసా

Follow Udayam on Google
రచన దేవి Aug 08, 2026 9:52 AM అనకాపల్లి General
వానలు కరువైనా.. సాగుకు భరోసా - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నా.. జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి. అధికారులు పరిశీలించి 61,464 ఎకరాల్లో పంటల సాగుకు నీటి భరోసా ఉందని అంచనా వేశారు. తాండవ జలాశయంలో 4,100 ఎంసీఎఫ్‌టీ నీరు ఉంది. నీటిని పొదుపుగా వాడితే వరి సాగు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దుగ్గాడ కాలువలోనూ వరినాట్లు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...