వార్తలకు తిరిగి వెళ్లండి
భద్రాద్రి జిల్లాలో వర్షం.. రైతన్నలకు ఊరట

భద్రాద్రి జిల్లాలో కురిసిన వర్షం పత్తి రైతన్నలకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది. పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడగా, మరో రెండు మంచి వర్షాలు కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎగువన కురిసిన వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...