వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 'లేడీ డాన్'గా పేరొందిన కోనేటి సులోచన ఇంట్లో పోలీసుల ప్రత్యేక బృందాలు శనివారం మెరుపు దాడులు నిర్వహించాయి. రూ.వందల కోట్ల విలువైన భూముల అక్రమాలు, ఫోర్జరీ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో 50 రకాల ఆస్తి పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన 15 ఖాళీ బాండు పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

