Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అర్చరీ పోటీలకు గిరిజన విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
నిర్మల్ Sep 05, 2026 11:52 AM నిర్మల్General
రాష్ట్రస్థాయి అర్చరీ పోటీలకు గిరిజన విద్యార్థుల ఎంపిక - Udayam
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ నెల 6న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అర్చరీ టోర్నమెంట్‌ కు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా క్రీడల అధికారి బుక్య రమేష్‌ శనివారం తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు చవాన్‌ రంజిత్‌ సింగ్‌, జాదవ్‌ కరణ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...