వార్తలకు తిరిగి వెళ్లండి

కవ్వాల్ టైగర్ జోన్ రద్దు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ డిమాండ్ చేశారు.
సోమవారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే 'టైగర్ జోన్ వద్దు' అని తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. టైగర్ జోన్ ను రద్దు చేసే విధంగా తాము కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

