వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా బొబ్బిల్లంక ఎస్సీ స్టేషన్ వాటర్ వరకు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నెల 21, 22 తేదీల్లో పనులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

