వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 4 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో స్వాతి తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.
Comments
Loading comments...

