Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతకాలతో మెరిసిన గిరిజన క్రీడాకారుడు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:13 PM పార్వతీపురం మన్యంGeneral
పతకాలతో మెరిసిన గిరిజన క్రీడాకారుడు - Udayam
తణుకులో ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో జి.శివడకు చెందిన గిరిజన క్రీడాకారుడు కె.మోహన్‌రావు రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. షాట్‌పుట్, హ్యామర్ త్రోలో స్వర్ణాలు, జావెలిన్ త్రోలో కాంస్యం గెలిచారు. జి.శివడ ఎంపీపీ పాఠశాలలో సవర భాష వాలంటీర్‌గా పనిచేస్తున్న మోహన్‌రావు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాణిస్తున్నారు. ఆయనను ప్రభుత్వం ప్రోత్సహించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...