వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి పశువైద్య కేంద్రాన్ని శుక్రవారం వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ మన్మధరావు, అసిస్టెంట్ డైరెక్టర్ రెడ్డి కృష్ణ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ మేరకు కేంద్రంలో అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరు , నిర్వహణ తీరును వారు పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, పశువులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి, అదికారులకు పలు సూచనలు చేసారు
Comments
Loading comments...

