వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలను శనివారం బొబ్బిలి RDO రామ్మోహనరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల నుంచి ఫారం 6, 7, 8 సేకరించాలని సూచించారు. అర్హులై ప్రతి ఒక్కరికి నూతన ఓటు నమోదు చేయాలని, క్లయిమ్ ఫారాలను తప్పులు లేకుండా ఆన్లైన్ చేయాలని BLO లను ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

