వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కొలమద్ది గ్రామంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సర్పంచ్ దిలీప్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు.
సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దిలీప్ తెలిపారు. పంటకు సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

